Saturday, May 18, 2024

ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోసం గతంలోనే డిమాండ్ చేశాం

spot_img

ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను పెట్టాలని తాము గతంలోనే డిమాండ్ చేశామన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. కుల గణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ఓబీసీ మంత్రిత్వ శాఖపై రెండు సార్లు తీర్మానాలు చేసి పంపించాము. ప్రధాని మోడీకి కూడా విజ్ఞప్తి చేశాం. ఓబీసీ శాఖ పెడితే బీసీలకు రూ.2 లక్షల కోట్లు అయినా వస్తాయి. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది. కులగణనపై న్యాయ విచారణ కమిషన్ అయినా వేయాలి. ఈ బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని కోరారు.

ఇది కూడా చదవండి:అసెంబ్లీలో కులగణన తీర్మానంపై చర్చ.. మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్‌

 

Latest News

More Articles