Sunday, May 19, 2024

ప్రియమైన మోడీ కాదు.. పిరం మోడీ.. కేటీఆర్ సెటైర్లు

spot_img

హైదరాబాద్: 2014,2018, 2023 లో మనము ఎవరితోనైనా పొత్తు పెట్టుకున్నమా? మనం ఎవరితో కలిసి పని చేస్తాలేం ఒంటిరిగానే పోటీ చేస్తున్నాము. అలాంటప్పుడు మనం బిజెపికి బి టీం ఎలా అవుతామని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ  పైనా కేసులు ఉన్నాయి. మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు. అందుకు మీరు బిజెపికి బి టీం అని అనాలా అని అన్నారు. మనం తెలంగాణ ప్రజల టీం. మోడీ అన్ని పిరం చేసిండు, అందుకే అయినా ప్రియమైన మోడీ కాదు పిరం అయినా మోడీ అని పిలవాలని అన్నారు.

Also Read.. నాంపల్లి అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

400 రూపాయలు ఉండే సిలిండర్ ని మోడీ 1200 చేసిండు. అందుకే సీఎం కేసీఆర్ 800 రూపాయిలు భరించి ప్రజలకు 400 రూపాయిలుకే  సిలిండర్ ఇస్తారు. రేషన్ కార్డు ఉన్నవారందరికి సన్న బియ్యం ఇస్తాము. సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి భీమా సౌకర్యం ఇవ్వనున్నారు. బీజేపీ ఖతం అయిపోయింది డిపాజిట్ కూడా రాదు. గోషామహల్ లో కూడా బిజేపీ కి  డిపాజిట్ రావద్దు. హిందూ ముస్లిం కొట్లాటా పెట్టి ఓట్లు పంచాయతీ చేస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా కసి మీద గెలవాలి ఈ సారి. హైదరాబాద్ లో బిజెపి అనేది ఉండకూడదని, అందుకు అందరూ కలిసి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Latest News

More Articles