Sunday, May 19, 2024

నాంపల్లి అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన కేటీఆర్.. 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన

spot_img

హైదరాబాద్: నాంపల్లిలోని అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. నాంపల్లి బిఅరెస్ అభ్యర్థి సి.హెచ్.ఆనంద్ కుమార్ గౌడ్, గోశామహల్ బిఅరెస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ బిలాల్ వారి వెంట ఉన్నారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు కేటీఆర్, తలసాని.

Also Read.. ప్రియమైన మోడీ కాదు.. పిరం మోడీ.. కేటీఆర్ సెటైర్లు

ఘటన పై పూర్తి స్థాయి దర్యాప్తు కు వారు ఆదేశించారు. జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. పలువురు ఫైర్ అధికారులు, పోలీసులతో ఘటనపై అరా తీశారు కేటీఆర్. మృతుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్ గ్రేషియా తో పాటు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేస్తామని ప్రకటించారు.

Latest News

More Articles