మహబూబ్ నగర్ జిల్లా: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆల వెంకటేశ్వర రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
Also Read.. సంక్రాంతి పండుగతో నిర్మానుష్యంగా హైదరాబాద్ రోడ్లు
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలోని ఇవాళ దశదిన కర్మ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. శశివర్ధన్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆల వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే విజయుడు, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.