Friday, May 17, 2024

9 ఏండ్లలో బీజేపీ అన్నీ రంగాల్లో విఫలమైంది

spot_img

ఈ నెల (మే) లో జాతీయ పార్టీ ఆదేశాల అనుగుణంగా బీజేపీ హటావో దేష్ కి బచావో నినాదంతో ముందుకెళ్తామన్నారు సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. జూన్ 4న ముగింపు సభ, కొత్తగూడెంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఖమ్మం సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఆయన.. వరంగల్ జిల్లాలో విభజన హామీ అమలు మీద సభ నిర్వహించామని..మండలానికి రెండు నుంచి మూడు వేల మందితో సభలు నిర్వహిస్తామన్నారు. ఎప్పుడు లేని విధంగా సీపీఐలో కదలిక వచ్చిందన్నారు కూనంనేని.

కొత్తగూడెంలో జరిగే భారీ బహిరంగ సభకు జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా వస్తున్నారని తెలిపారు కూనంనేని సాంబవరావు. దేశంలో బీజేపీ పాలనలో ఎన్నో భయానక ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఓట్ల కోసం ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి కూడా పాకులాడటం సరికాదన్నారు. బీజేపీ వాళ్లు మొన్నటి వరకు శ్రీరామ్ ను అడ్డు పెట్టుకుని ఓట్లు అడిగేవారు..ఇప్పుడు కొత్తగా బజరంగ్ బలిని అడ్డు పెట్టుకుని అడగటం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు అన్యాయం చేసినా, అరెస్ట్ చేయని వాళ్ళు…. ప్రతిపక్షాలు వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేయడం ఆప్రజాస్వామ్యన్నారు. బీజేపీ వాళ్లు మైనార్టీలను హతమార్చినా వారిపై కేసులు ఎందుకు నమోదు కావడం లేదని ప్రశ్నించారు కూనంనేని.

బీజేపీ నాయకులు మతం పేరుతో విద్వేషం ఎందుకు రగుల్చుతున్నారు. ఈ 9 ఏళ్లలో బీజేపీ అన్నీ రంగాల్లో విఫలమైందన్నారు. బీజేపీకి వ్యతిరేఖంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ ఏకం అవుతున్నారని తెలిపారు. ఆ పార్టీ పతనం మొదలైందని అన్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారం పోతుందని..ఇక్కడ నుంచే వారి పతనం మొదలవుతునారు కూనంనేని సాంబశివరావు.

Latest News

More Articles