Thursday, May 2, 2024

 దేశ వ్యాప్తంగా కొత్త‌గా 1580 క‌రోనా కేసులు, 12మంది మృతి

spot_img

దేశ వ్యాప్తంగా కొత్త‌గా 1,580 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 12 మంది చనిపోయారు. 1,28,764 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,580 మందికి పాజిటివ్‌గా తేలిందని తెలిపింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,76,599కి చేరింది. ప్రస్తుతం దేశంలో 18,009 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వైరస్ నుంచి ఇప్పటి వరకు 4,44,28,417 మంది కోలుకున్నారు. మరోవైపు 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా 12 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా  మరణాల సంఖ్య 5,31,753 కి చేరింది. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.04 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. రికవరీ రేటు 98.77 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు చెప్పింది.

Latest News

More Articles