వరంగల్ జిల్లాలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నిధులతో 10,000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో నిర్మించిన గోదాంను మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. గోదాంల ప్రారంభం ద్వారా స్థానిక రైతులు తమ పంటలను నిలువ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందన్నారు మంత్రులు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పాల్గొన్నారు.