Saturday, May 18, 2024

సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్.. ఒంటిపై 500కు పైగా గాయాలు

spot_img

డబుల్ ఇంజిన్ సర్కార్‎లో పోలీసులకే భద్రత లేకుండా పోయింది. సూసైడ్ చేసుకున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఒంటి మీద 500లకు పైగా గాయాలున్నాయి. దాంతో ఏం జరిగిందోనని తీవ్ర కలకలంరేగింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‎లో జరిగింది. మీను అనే మహిళా కానిస్టేబుల్ ఉన్నావ్‎లో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె అక్కడే పోలీస్​ లైన్​లోని హాస్టల్​లో నివాసం ఉంటుంది. కాగా.. మీను గురువారం తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అక్కడే ఉన్నవారు అప్రమత్తమై వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ నివేదికలో దారుణ విషయాలు బయటపడ్డాయి. మీను ఉరివేసుకుని చనిపోయిందని, కానీ మృతదేహాంపై మాత్రం 500కుపైగా గాయాలున్నట్లు వెల్లడైంది.

Read Also: వరల్డ్ కప్ 2023.. ఒక్క మ్యాచు కూడా ఓడిపోని జట్ల మధ్య పోరు

పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మీను ప్రేమ వ్యవహారం ఉందని తేల్చారు. అలీగఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో మీను ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. అతడు మీనును మోసం చేసి వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని.. బాధితురాలు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మీను.. తననుతాను గాయపరుచుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Latest News

More Articles