Friday, May 17, 2024

కేంద్రం నిర్లక్ష్యం కారణంగానే రైలు ప్రమాదం.. లాలూ ఫైర్..!

spot_img

రైల్వే వ్యవస్థను మోదీ సర్కార్ నాశనం చేసిందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్‌, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ విమర్శించారు. ఒడిశాలో జరిగిన ప్రమాదానికి కేంద్రం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లాలూ డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతకుముందు దేశంలో అన్ని రైళ్లను ప్రచార మంత్రే జెండాలనే ఊపుతున్నారని, దేశానికి రైల్వే మంత్రి ఎవరో తెలియడం లేదని ఆర్జేడీ ట్వీట్ చేసింది. అన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడాన్ని ఈ మేరకు ఆర్జేడీ తన ట్వీట్ లో ఎద్దేవా చేసింది.

Latest News

More Articles