ఇజ్రాయిల్, లెబనాన్ల మధ్య దాడులు తీవ్రమయ్యాయి. ఇజ్రాయిల్ ప్రయోగించిన డ్రోన్ను లెబనాన్ తిరుగుబాటు దారుల గ్రూపు హిజ్బుల్లా కూల్చివేసింది. దక్షిణ లెబనాన్లోని ఇక్లిమ్ అల్-తుఫా నుండి ప్రయోగించిన ఉపరితలం నుండి గగనతలం క్షిపణితో కూల్చివేసినట్లు హిజ్బుల్లా తెలిపింది. ఇజ్రాయిల్ దురాక్రమణను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంది. అయితే ఈ ప్రకటనను ఇజ్రాయిల్ అధికారులు తిరస్కరించారు. అంతేకాదు..ప్రతిచర్యగా ఇజ్రాయిల్ బీకా వ్యాలీ, మజదీల్ నగరంపై బాంబులతో దాడికి దిగింది. ఈ దాడిలో సుమారు నలుగురు మరణించారు. అగ్నిప్రమాదంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో ఆస్తినష్టం జరిగింది. టైర్ నగరంపై హిజ్బుల్లా బాంబుదాడితో హసన్ హుస్సేన్ సలామీని హత్య చేసినట్లు ఇజ్రాయిల్ ఆరోపణలతో.. లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులను వేగవంతం చేసింది.
ఇది కూడా చదవండి: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఆ టిక్కెట్లు పాత రేటుకే!