Sunday, May 19, 2024

ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లుతున్నారు

spot_img

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందిందని, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ప్రభుత్వం పని తిరుపైన సంతృప్తిగా ఉన్నారన్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్‌తో కలిసి దేవరకొండ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నిధుల ద్వారా నిర్మించిన మినీ బస్ డిపోను ఆయన ప్రారంభించారు. అనంతరం 17వ వార్డులో నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్ ను ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవం చేశారు.

అనంతరం వాసవీ మాత ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి, వాసవీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు ఊహించని విధంగా అభివృద్ధి చెందయని.. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పైన మొదటి నుంచి వివక్ష చూపుతోందన్నారు. మొన్న పార్లమెంట్ సమావేశాల్లో పెట్టిన మహిళా బిల్లు కేవలం రాజకీయ లబ్ధికోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టిందన్నారు. నిజంగా మహిళల పట్ల కేంద్ర సర్కార్‌కి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే పెట్టాల్సి ఉండేదని ఆయన తెలిపారు

Latest News

More Articles