శంషాబాద్: శంషాబాద్ శివారులో చిరుత పులి సంచరిస్తుందంటూ స్థానికుల భయాందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామ శివారులోని సీతారామ చంద్ర స్వామి ఆలయం సమీపంలో చిరుత పులి సంచరిస్తుందంటూ గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
Also Read.. పార్ట్ టైమ్ జాబ్ పేరుతో ఫ్రాడ్.. యువతి ఫిర్యాదుతో గుట్టురట్టు
సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పరిశీంచారు. సీసీ కెమెరాల దృశ్యాలను చూసిన రాజేంద్రనగర్ అటవీశాఖ అధికారులు.. అది చిరుత కాదని, అడవి పిల్లి అని తేల్చారు. స్థానికులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని, ఏదైనా క్రూర జంతువులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.