హైదరాబాద్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. 25 లక్షలు ఇస్తేనే బాలుడిని వదిలిపెడతామని బాలుడి తల్లితండ్రులకి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
Also Read.. మహిళా కానిస్టేబుల్కు అసభ్యకర మెసేజులు.. ఎస్ఐ సస్పెండ్
పోలీసులను ఆశ్రయించడంతో.. వారు కాలనీలోని సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. బాలుడిని కారులో కిడ్నాప్ చేసినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. విచారణలో మేనమామనే కిడ్నాప్ సూత్రధారిగా పోలీసులు తేల్చారు. బాలుడు సురక్షితంగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.