Friday, May 17, 2024

మటన్ తినే విషయంలో గొడవ. వ్యక్తి హత్య

spot_img

సికింద్రాబాద్: తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చారి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మటన్ విషయంలో జరిగిన గొడవ హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్ బాయ్ బస్తీకి చెందిన చారి, అజయ్ స్నేహితులు. మద్యం మత్తులో భోజనం చేసే సమయంలో మటన్ తినే విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది.

Also Read.. అశ్విన్‌పై యువరాజ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలో మాట మాట పెరిగి గొడవ కాస్త పెద్దదిగా కావడంతో మద్యం మత్తులో ఉన్న అజయ్ తన వెంట ఉన్న కత్తితో చారి పై దాడి చేశాడు. దాడిలో చారికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి మృతి చెందాడు. అజయ్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Latest News

More Articles