అడవిలో ఉండాల్సిన చిరుత హోటల్కి వచ్చింది. దాంతో కాసేపు ఆ హోటల్ అంతా కలకలం రేగింది. ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. గురువారం ఉదయం ఓ చిరుత కనోతా ప్రాంతంలోని ఓ ప్రైవేటు హోటల్ గదిలోకి ప్రవేశించింది. అక్కడున్న సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసింది. దాదాపు రెండు గంటల పాటు చిరుత ఆ గదిలోనే గడిపింది. అయితే, ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిరుతను చూసిన హోటల్ యాజమాన్యం.. గదికి బయట నుంచి తాళం వేసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఎంతో చాకచక్యంగా చిరుత పులిని పట్టుకొని బోనులో బంధించారు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా, చిరుత గదిలో ఉన్న దృశ్యాలను అక్కడే ఉన్న సిబ్బంది తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
जयपुर के हैरिटेज होटल में घुसा लेपर्ड, टूरिस्ट होटल छोड़कर बाहर भागे, वीडियो हो रहा वायरल.#Jaipur #Leopard #viralvideo pic.twitter.com/2oIKzlIMMn
— Nidhi solanki🇮🇳 (@iNidhisolanki) January 19, 2024
Read Also: నేడు మెదక్ ఎంపీ స్థానంపై సమీక్ష.. కేసీఆర్ పోటీచేస్తారని ఊహాగానాలు