Saturday, May 4, 2024

ధోని వీరాభిమాని ఆత్మహత్య

spot_img

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని వీరాభిమాని 34 ఏళ్ల గోపికృష్ణన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని కడలూర్ జిల్లా అరంగూర్ కు చెందిన గోపికృష్ణన్ చెన్నై సూపర్ కింగ్స్ ను తలపించేలా తన ఇంటిని మార్చేసి బాగా పాపులర్ అయ్యాడు.ఆర్ధిక సమస్యలతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

కడలూర్‌ జిల్లా అరంగూర్‌కు చెందిన గోపికృష్ణన్‌ (34) అన్భరసి భార్యాభర్తలు. వీరికి కిషోర్, శక్తివేల్‌ కుమారులు, 10 రోజుల క్రితమే పుట్టిన కుమార్తె ఉంది. గోపికృష్ణన్‌  గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్ధిక సమస్యలతో మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు జరిపిన దర్యాప్తులో తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: న్యాయం కోసం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా

Latest News

More Articles