Saturday, May 18, 2024

చెల్లి లవ్ అఫైర్ నచ్చక చెల్లిని, అడ్డొచ్చిన తల్లిన చంపిన యువకుడు

spot_img

చెల్లి లవ్ అఫైర్ నచ్చక చెల్లిని, అడ్డొచ్చిన తల్లిన ఓ యువకుడు చంపిన ఘటన కర్ణాటకలో జరిగింది. హున్సూర్ తాలుకాలోని మరూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ధనుశ్రీ ఓ ముస్లిం యువకుడిని ప్రేమించింది. ఇది నచ్చని ఆమె అన్న నితిన్.. ప్రతిరోజు గొడవ పడేవాడు. వీరిద్దరి గొడవను వారి తల్లిదండ్రులు వారించేవారు. తాజాగా ఇదే విషయం మీద అన్నాచెల్లి గొడవపడ్డారు. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ముస్లిం వ్యక్తితో సంబంధాన్ని కొనసాగించవద్దని నితిన్ తన సోదరికి సూచించినప్పటికీ ఆమె నిరాకరించడంతో తల్లిని, చెల్లిని బైక్‌పై గ్రామంలోని బంధువుల ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో చెరువు వద్ద ఆపి, ధనుశ్రీని చెరువులోకి తోశాడు.

Read Also: ఈ నెల 28న మధ్య ప్రదేశ్‎కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఆమెను రక్షించేందుకు యువతి తల్లి 43 ఏళ్ల అనిత ప్రయత్నిస్తే ఆమెను కూడా చెరువులోకి తోసేశాడు. అనంతరం తడి బట్టలతో ఇంటికి వెళ్లిన నితిన్.. జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పాడు. అతను వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో.. ఘటనాస్థలానికి చేరుకొని, చెరువులో వెతకగా.. ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. తల్లీకూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles