Sunday, May 19, 2024

రాడిసన్ హోటల్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లు నిర్ధారణ కాలేదు

spot_img

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రాడిసన్ హోటల్‌లో జరిగిన పార్టీలో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లుగా నిర్ధారణ కాలేదని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాఫ్తు కొనసాగుతోందని తెలిపారు. ఇవాళ(మంగళవారం) నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన డీసీపీ.. రాడిసన్ హోటల్లో చాలాసార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పినట్లు తెలిపారు. వివేకానంద, కేదార్, నిర్భయ్‌లు నిన్న కొకైన్ తీసుకున్నట్టుగా పరీక్షల్లో తేలిందన్నారు. మిగిలిన వారికీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

వివేకానందకు అబ్బాస్ 10సార్లు కొకైన్ సరఫరా చేసినట్లు దర్యాఫ్తులో తేలిందన్నారు. కేసులో నిందితులైన లిపి, శ్వేత, సందీప్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. చరణ్ బెంగళూరులో ఉన్నట్లు తేలిందన్నారు. దర్శకుడు క్రిష్ విచారణకు హాజరవుతానని చెప్పినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి:జయప్రద పరారీలో ఉన్నారు: స్పెషల్ కోర్టు

Latest News

More Articles