Sunday, May 19, 2024

ఐస్‎పై పడుకోబెట్టి.. నోట్లో మూత్రం పోసి.. రక్తం కారేలా కొడుతూ..

spot_img

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడిని కిడ్నాప్ చేయడమే కాకుండా ఐసుపై పడుకోబెట్టి రక్తంకారేలా కొట్టారు. దుర్మార్గులు ఇక్కడితో ఆగలేదు, యువకుడి నోటిలో మూత్ర విసర్జన చేసి పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటన  కరైరాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల ప్రకారం కరైరాలో  దుండగులు ఒక యువకుడిని కిడ్నాప్ చేశారు. అతన్ని ఐస్ పై పడుకోబెట్టి కొట్టారు.బాధితుడిని కిడ్నాప్ దాడికి పాల్పడిన వీడియోను కూడా దుండగులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసుల వరకు చేరింది. దీంతో ఇద్దరు నిందితులకు ఢిల్లీలో అరెస్టు చేశారు.

కరైరాకు చెందిన ధర్మేంద్ర, ఆకాష్ యాదవ్, సౌరభ్‌లతో తనకు గొడవ జరిగిందని బాధితుడు తెలిపాడు.  దీని తర్వాత, జనవరి 29 తనను కారులో వచ్చి కిడ్నాప్ చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కర్ధాలోని ఆకాష్‌ యాదవ్‌కు చెందిన ఐస్‌ ప్లాంట్‌ వద్దకు తీసుకెళ్లి ఐస్‌ బ్లాక్‌పై పడుకోబెట్టి గంటపాటు కొట్టారని బాధితుడు చెప్పాడు. చెప్పుకోలేని విధంగా చిత్రహింసలకు గురిచేశారని వెల్లడించాడు. ఇది జరిగిన మరుసటి రోజు ముంగావలి కూడలిలో బాధితుడిని పడేసి దుండగులు పరారయ్యారు. ఈ ఘటనను కొంతమంది యువకులు గమనించి బాధితుడిని రక్షించారు. అయితే అప్పటికే సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు గాలించి నిందితులను పట్టుకున్నారు.

ఇది కూడా చదవండి: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కు 400 చార్టర్డ్ ఫ్లైట్స్..!

Latest News

More Articles