Saturday, May 11, 2024

బీఆర్ఎస్ పార్టీలో చేరిన మహారాష్ట్ర ఎన్సీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలు

spot_img

హైదరాబాద్: మహారాష్ట్ర నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఉధృతంగా కొనసాగుతున్నయి. శనివారం మహారాష్ట్ర లోని చంద్రాపూర్ జిల్లా నుండి ఎన్సీపీ, కాంగ్రెస్ , బీజేపీ పార్టీలకు చెందిన పలువురు మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఎన్సీపీ మహారాష్ట్ర సోషల్ జస్టిస్ విభాగం ఉపాధ్యక్షులు సునీల్ దహెగావ్ కర్ , చంద్రాపూర్ జిల్లా అధ్యక్షులు ప్రియదర్శన్ అజయ్ ఇంగ్లే , ఎన్సీపీ చంద్రాపూర్ జిల్లా గూగూస్ సిటీ అధ్యక్షుడు దిలీప్ ఊషన్న పిట్టల్వార్ , చంద్రాపూర్ జిల్లా నేషనలిస్ట్ యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి హేమంత్ సింగ్ గోవింద్ సింగ్ ఠాకూర్ , జిల్లా ఉపాధ్యక్షులు నిఖిల్ జగదీష్ దుర్యోధన్ , గూగూస్ సిటీ బీజేపీ మాజీ కౌన్సిలర్ మహేష్ లాట్ , గూగూస్ సిటీ ఆప్ మాజీ అధ్యక్షుడు నవీన్ మోర్ , గూగూస్ సిటీ బీజేవైఎం అధ్యక్షుడు శ్రీనివాస్ తాల పెల్లి , గూగూస్ సిటీ భీమ్ సేన యూత్ ప్రెసిడెంట్ సుశాంత్ వాగ్మర్ తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మోడల్ పాలన మహారాష్ట్రలో రావాలని కాంక్షిస్తూ తాము బిఆర్ఎస్ లో చేరుతున్నట్లు మహారాష్ట్ర నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో గూగూస్ బిఆర్ఎస్ నాయకుడు తాండ్ర వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles