Sunday, May 12, 2024

చుట్టూ కొబ్బరి పీచు.. మధ్యలో గంజాయి ప్యాకెట్లు

spot_img

స్మగ్లర్స్ కూడా రోజురోజుకూ తెలివిమీరుతున్నారు. వినూత్న పద్ధతుల్లో స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా కొత్త విధానంలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న నిందితులను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఒడిషా నుంచి హైదరాబాద్‎కు తరలిస్తున్న 75 లక్షల విలువైన 250 కేజీల గంజాయిని మహేశ్వరం, మీర్ పేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్నతమిళనాడుకు చెందిన మలై స్వామి, రామర్‎ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలో నివసించే రాజేష్ అనే వ్యక్తి ఈ గంజాయిని తరలిస్తే తమకు లక్షా యాభైవేల రూపాయలు ఇచ్చేవాడని తెలిపారు. గంజాయి పాకెట్స్ కనిపించకుండా లారీలో కొబ్బరి పీచు నింపి.. అందులో గంజాయి తరలిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు తనిఖీలు చేసి, వారిని రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ తెలిపారు.

Read Also: మోడీది మాటల్లో దేశభక్తి.. చేతల్లో దేశద్రోహం

Latest News

More Articles