సంగారెడ్డి : పటాన్ చెరు పట్టణంలో దారుణ ఘటన జరిగింది. తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి, ఆమె కూతురిపై అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్నా పూర్ లో మేస్త్రి పని చేసే పెద్ది రాజు అనే వ్యక్తి మైనర్ బాలిక (13) పై అత్యాచారం చేశాడు.
Also Read.. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజాపక్షమే
నిందితుడు మైనర్ బాలిక తల్లితో వివాహేతర పెట్టుకొని చిన్నారిపై కన్నేసాడు. ఆమె ఇంట్లో లేని సమయంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో తల్లికి అనుమానం వచ్చి ప్రశ్నించింది. దీంతో అత్యాచారం జరిగిన విషయం బయటికి వచ్చింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని నిందితుడు రాజును అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.