చెరువులో పడ్డాడనుకున్న వ్యక్తి.. పక్కనే ఉన్న మ్యాన్ హోల్లో శవమై తేలిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ సమీపాన ఉన్న మంగళవాని చెరువులో సంతోష్ అనే బాలుడు ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు రెండు రోజులుగా ఆ చెరువులో సంతోష్ కోసం జల్లెడపడుతున్నారు. కాగా.. ఈ రోజు చెరువు పక్కనే ఉన్న వాసవి వెంచర్లోని మ్యాన్ హోల్లో ఓ శవం ఉందని పోలీసులకు సమాచారమొచ్చింది. దాంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి.. శవాన్ని బయటకు తీసి చూడగా.. అది సంతోష్ శవం అని గుర్తించారు. నమోదు చేసిన పోలీసులు.. సంతోష్ని ఎక్కడో చంపి ఈ మ్యాన్ హోల్లో పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.