Sunday, May 19, 2024

హైదరాబాద్‎లో ఫ్లైఓవర్ పైనుండి దూకి సూసైడ్

spot_img

మద్యంమత్తులో ఓ వ్యక్తి ఫ్లై ఓవర్ పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్‎లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూక్యా అశోక్ అనే వ్యక్తి వెల్డింగ్ షాపులో కార్మికుడిగా పని చేస్తున్నాడు. రేష్మాబేగం అనే మహిళను ప్రేమ వివాహం చేసుకొని, కోమటి బస్తీలో నివసిస్తున్నాడు. ప్రతి రోజు మద్యం సేవించి భార్యను కొడుతూ ఉండేవాడు. మద్యంమత్తులో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటమే కాకుండా, గతంలో రెండు సార్లు బ్లేడుతో కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ రోజు ఉదయం మద్యం సేవించి భార్యను కొట్టి, ఆత్మహత్య చేసుకుంటానని ఇంటిలో నుండి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం సమయంలో బాలానగర్ ఫ్లై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles