హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో ఇవాళ(మంగళవారం) ఉదయం యాక్సిడెంట్ జరిగింది. ట్రాలీ ఆటో స్కూటీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సంధ్య అనే మహిళ చనిపోయింది. ఏడాది క్రితం సంధ్య భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. వీరికి ముగ్గురు పిల్లలు. సంధ్య మృతితో వారి ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.