ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏడేళ్లలో రూ.2,931 కోట్లతో అభివృద్ధి పనులను చేసినట్టు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. మరోసారి ఆదరిస్తే సేవకుడిగా ఉంటానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు.
Also Read.. ఇదేం అనువాదం.. డీకే వ్యాఖ్యలతో కాంగ్రెస్లో కొత్త చిచ్చు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా తనను ఆదరించిన ప్రజలు ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించానన్నారు. మరోసారి అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలను మళ్ళీ బిఆర్ఏస్ అధికారంలోకి వస్తే 400లకే గ్యాస్ సిలిండర్, పింఛన్ 5000లకు పెంపు, రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణీ చేస్తామాన్నారు.