ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఆయుష్ కమిషర్గా ఎస్బీఆర్ కుమార్ను నియమించగా.. ఢిల్లీ ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్గా హిమాన్షు కౌషిక్ , గ్రామాల సర్వే, మ్యాపింగ్ కార్యక్రమం స్పెషల్ కమిషనర్గా ఏ సిరిని నియమించారు.
ఇక బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా జి క్రైస్ట్ కిషోర్ కుమార్ను.. కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్గా భరత్ తేజ, ఇన్సురెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా వి ఆంజనేయులును బదిలీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.