Friday, May 17, 2024

అర్సనపల్లి రోడ్డు ప్రమాద బాధితులకు.. ఎమ్మెల్సీ కవిత ఆర్థిక సహాయం

spot_img

వారం రోజుల క్రితం అర్సనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. బాధితుల బంధువులకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఆర్థికసాయం అందజేశారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఆర్‌ ప్రశాంత్‌, డి చరణ్, డి శ్యామ్, ఆర్ రేఖలు మృతి చెందగా.. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.

ఎమ్మెల్సీ కవిత తరపున బోధన్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు కుటుంబీకులను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.35వేలు, ప్రమాదంలో గాయపడిన వారికి రూ.15వేలు అందజేశారు.

Latest News

More Articles