ఐపీఎల్ 2023 చివరి లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ను 77 పరుగుల తేడాతో ఓడించి 12వ సారి ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఓపెనర్లు డేవాన్ కాన్వే 87 (52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లు) రుతురాజ్ గైక్వాడ్ 79 (50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో చెన్నై 223 రన్స్ కొట్టింది.
ఆ తర్వాత బ్యాటిక్ చేసిన ఢిల్లీ టీంలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ 86 (58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో వార్నర్ సేన నిర్ణీత ఓవర్లలో 146 రన్స్ మాత్రమే చేసింది.
చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 2, పథిరన, థీక్షణ రెండేసి వికెట్లు తీయగా.. జడేజా, దేశ్పాండేకు ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు చెన్నైపై.. ఢిల్లీ బౌలర్లు సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నార్జ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.