రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మావోయిస్టులు బహిరంగలేఖ రాశారు. ఆ లేఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం సృష్టించింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులపై తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా తగిన గుణపాఠం చెబుతామంటూ లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. ఈ లేఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో విడుదలైంది.
Read Also: ‘లే అన్నా.. ఆడుకుందాం’.. చనిపోయిన అన్నను లేపుతున్న చిన్నారి