నకిలీ విత్తనాలపై దృష్టి సారించారు పోలీసులు. తాజాగా సిద్దిపేటలో ప్యాకింగ్ లేకుండా 29 సంచుల్లో నిల్వ ఉంచిన 1450 కిలోల నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ ఫోర్స్,హుస్నాబాద్ పోలీసులు సీజ్ చేశారు. ఒక్కో సంచిలో 50 కిలోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు, పురుగుల మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి:అందరికీ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్న సీఎం రేవంత్.. ఇప్పుడు కొందరికే అంటున్నడు