Sunday, May 19, 2024

అందరికీ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్న సీఎం రేవంత్.. ఇప్పుడు కొందరికే అంటున్నడు

spot_img

ఎన్నికల సమయంలో అందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇస్తామని రేవంత్‌రెడ్డి అన్నారని.. కానీ ఇప్పుడు కొందరికే అంటున్నారని అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో  మాట్లాడిన కేటీఆర్ .. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు.

మరి కొద్ది రోజులు భరిస్తాం.. తర్వతా వాళ్లు ఇటుకలతోని కొడితే మేము రాళ్లతోనే కొడతాం.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితాడని ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా రాకపోతుండే. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లి లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరు అనుకోలేదు. రేవంత్ రెడ్డి సీఎం లెక్క మాట్లాడడం లేదు..లంకె బిందెల దొంగ లెక్క మాట్లాడుతున్నాడు. లంకె బిందెల కోసం దొంగలు అర్ధరాత్రి తిరుగుతారు కానీ సచివాలయంలో రాజకీయ నాయకులు తిరగరు. లంకె బిందెలు వెతికే రేవంత్ రెడ్డి పాతబద్ధులు మళ్ళీ బయటకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు కోసం మోహాలు చూసుకునే పరిస్థితి వచ్చింది. కరెంటు కోతలు, తాగునీటి గోసలు ప్రారంభమయ్యాయి. ఇదేనా మార్పు అంటే అని ప్రశ్నించారు కేటార్. మిషన్ భగీరథను నిర్వహించే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే అధికారంలోకి వస్తామని అనుకోలేదు… అందుకే అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. అందరికీ అన్ని ఇస్తామన్నారు. అప్పుడేమో అందరికీ అన్ని ఇప్పుడేమో కొందరికి మాత్రమే కొన్ని ఇస్తామంటున్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు…ఆడబిడ్డలకి 2500 ప్రతినెలా ఇస్తామన్నారు.. ఇంట్లో అవ్వతాతలకు ఇద్దరికీ  రూ.4000 చొప్పున ఇస్తామన్నారు. ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం ఒకటి కాదు రెండు కాదు కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలున్నారు. వాళ్లందరి నెలకు 2500 ఎప్పుడిస్తారని ఎదురుచూస్తున్నారు.500 రూపాయలకే సిలిండర్ అన్నడు…కోటి 24 లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఎదురుచూస్తున్నారు. 200 యూనిట్లు ఫ్రీ అని అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తాఅన్నాడు, కానీ ఇప్పుడు కొందరికే అంటున్నారు. వందరోజుల పాటు ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనుకున్నాము… శ్రీకృష్ణుడు  శిశుపాలుడి 100 తప్పులు లెక్కపెట్టినట్లు ఆగుదామనుకున్నాం. కానీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే మా పార్టీ పైన, మా పార్టీ అధినేత పైన అడ్డగోలుగా విమర్శలు చేశారు. పార్టీ కార్యకర్తలు ఎలాంటి పదవులు ఆశించకుండా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం సంవత్సరాలపాటు కష్టపడి పని చేశారు. వారందరికీ భవిష్యత్తు పైన భరోసా ఉంది.. నమ్మకం ఉందన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలను ఒక్క ఏడాది కాపాడుకుంటే ఆ కార్యకర్తలే నాయకులను కాపాడుకుంటారన్నారు కేటీఆర్. వచ్చిపోయే ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నా.. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కరే. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చరిత్రను ఎవరు చెరిపేయలేరన్నారు.

ప్రధాని మోడీ హవా లేదు.. ఏం లేదు.పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని ప్రధాని మనకు ఎందుకు అలోచించాలన్నారు. మన కృష్ణ నది పైన ఉన్న నీళ్లన్ననింటిని కేఆర్ఎంబికి అప్పజెప్పి, ఢిల్లీ వాళ్ల చేతిలో పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి. నల్లగొండలో మన పార్టీ మీటింగ్ పెడితే దెబ్బకు అసెంబ్లీలో తీర్మానం పెట్టి కెఅర్ఎంబికి ఇయ్యలేనని తీర్మానం పెట్టిండు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బకొడుతున్నాయి. అందుకే ఏ రోజు అయినా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాపాడుతాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించి పూర్వవైభవాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు కేటీఆర్.నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని మళ్లీ గెలిపిస్తారన్న విశ్వాసం మాకు ఉందన్నారు.

ఇది కూడా చదవండి:ఏపీ, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నా

 

Latest News

More Articles