Sunday, May 19, 2024

ఏపీ, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నా

spot_img

ఏపీలోని ముంగండలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇవాళ(ఆదివారం) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన ఆమె..డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం మండలం ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ప్రార్థించినట్లు తెలిపారు. ముత్యాలమ్మ అమ్మవారి పున:ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మసుకృతమని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండి ప్రగతి పథంలో ముందుకు సాగే విధంగా అమ్మవారి ఆశిస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఎమ్మెల్సీ కవిత.

ఇది కూడా చదవండి: రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు.. ఉత్తర్వులు జారీ

Latest News

More Articles