తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ను ప్రభుత్వం నియమించింది. సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డికి ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జీవో వెలువడిని తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
స్పెషల్ సెక్రటరీ ఎం హనుమంత రావు ఇవాళ(ఆదివారం) ఉత్తర్వులు జారీచేశారు. మీడియా అకాడమీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ హోదా పొందుతారు. గతంలో విశాలాంధ్ర పత్రికకు కే శ్రీనివాస్ రెడ్డి సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజా పక్షం పత్రికకు ఎడిటర్గా ఉన్నారు. అంతకుముందు అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్గా పనిచేశారు.
ఇది కూడా చదవండి: రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు.. ఉత్తర్వులు జారీ