Sunday, May 19, 2024

తెలంగాణలో 3 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మెడ్‌ట్రానిక్‌

spot_img

హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. హైదరాబాద్‌లో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

అదే బాటలో మరో మెడికల్‌ డివైజెస్‌ ఉత్పత్తిలో అంతర్జాతీయంగా పేరు పొందిన మెడ్‌ట్రానిక్స్‌.. సుమారు రూ.3 వేల కోట్లతో హైదరాబాద్‌లో మెడికల్‌ డివైజెస్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అమెరికా వెలుపల హైదరాబాద్‌లోనే మెడ్‌ట్రానిక్స్‌ అతిపెద్ద ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈమేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో మెడ్‌ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు.

మెడ్‌ట్రానిక్స్‌ తీసుకున్న నిర్ణయంపట్ల మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ఈ విధానాల ద్వారానే తెలంగాణకు పెట్టుబడులు తరలివస్తున్నాయని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

Latest News

More Articles