Sunday, May 19, 2024

కాంగ్రెస్ కు కౌంటరిస్తూ.. సీఎం కేసీఆర్ పాలనపై ఒవైసీ ప్రశంసలు..!!

spot_img

హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్క‌డైనా ముస్లిం విద్యార్థులకు ఆరు నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉచిత విద్య‌ను అందిస్తున్నారా? అని ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ సీడ‌బ్ల్యూసీ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.

Also Read.. మీ పిల్లల భవిష్యత్ బంగారంలా ఉండాలంటే..ఈ పాలసీలపై ఓ లుక్కెయ్యండి..!!

సీఎం కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపించారు. గ‌డిచిన 9 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మ‌త‌ఘ‌ర్ష‌ణ‌లు లేవ‌న్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా సాగుతోంద‌ని.. దేశంలోనే హ‌య్యెస్ట్ జీడీపీ తెలంగాణ‌లో ఉన్న‌ట్లు గుర్తుచేశారు. ఏ రాజ‌కీయ పార్టీ అయినా, త‌మ‌కు కావాల్సింది చేసుకోవ‌చ్చని పేర్కొన్నారు.  కానీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అత్య‌ద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని ఓవైసీ వెల్ల‌డించారు.

Latest News

More Articles