Saturday, May 18, 2024

ముదిరాజ్ కుటుంబాల్లో నీలి విప్లవం

spot_img

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం అమ్మపురం గ్రామంలో ముదిరాజ్ లకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గారు ముదిరాజ్ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసేలా నీలి విప్లవం తీసుకొచ్చారన్నారు.

సీఎం కేసీఆర్ గారికి మనమంతా రుణపడి ఉండాలి అన్నారు. సీఎం కేసీఆర్ గారిని మరోసారి ఆశీర్వదించాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు, నాయకులు, ముదిరాజ్ సంఘ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles