Friday, May 17, 2024

కాంగ్రెస్, బీజేపీలను రైతులు నిలదీయాలి

spot_img

జనగామ జిల్లా:- రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో FSCS ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ‘రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం. రైతులు అధైర్యపడొద్దు, తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అకాల వర్షాలతో ఇబ్బంది పడే రైతులకు అధికారులు సూచనలు చేయాలి. వర్షాలతో దెబ్బతిన్న పంటకు పది వేలు ఇచ్చిన మహాత్ముడు సీఎం కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో దెబ్బతిన్న పంటకు రెండు వేలు మాత్రమే నష్టపరిహారం ఇస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలవి నీచ రాజకీయాలు. రైతుల వద్దకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు వస్తే నిలదీయాలి’ అని పిలుపునిచ్చారు.

Latest News

More Articles