సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను సమ దృష్టితో చూస్తూ పాలన అందిస్తున్నారని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అన్నివర్గాల ప్రజలతో పాటు, మైనార్టీలను కూడా అన్ని విధాలుగా సీఎం ఆదుకున్నారన్నారు. ఇవాళ(మంగళవారం) పాలకుర్తిలోని క్యాంపు కార్యాలయంలో మైనార్టీలకు లక్ష ఆర్థిక సహాయం కింద పలువురు మైనార్టీలకు చెక్కులను అందజేశారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన.. మైనార్టీలకు చత్రలో లేనంతగా ఎంతో మేలు జరిగిందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా ఇలా ఎన్నో పథకాలు పార్టీలకు అతీతంగా తెలంగాణలోని ప్రతి గడపకు చేరుతున్నాయన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. మైనార్టీలు కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు.