Friday, May 3, 2024

ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటు..!

spot_img

అభివృద్ధి పట్టని కాంగ్రెస్‌, బీజేపీలు సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గు చేటని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ విద్యా దినోత్సవాన్ని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో బాలుర డిగ్రీ కళాశాలను, డిజిటల్‌ తరగతులను కలెక్టర్‌ సీహెచ్‌ శివలింగయ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ పాలనలో విద్యా రంగం లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఈ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కార్పొరేట్‌ విద్యకు దీటుగా ప్రభుత్వ విద్య ఉందన్నారు. పదేళ్ల కేసీఆర్‌ పాలన లో జిల్లాకు వైద్య , వ్యవసాయ, డిగ్రీ, జూనియర్‌, సాంఘిక సంక్షేమ జూనియర్‌ డిగ్రీ కళాశాలలు వచ్చాయన్నారు.

Latest News

More Articles