Friday, May 3, 2024

కొల్లూరులో డబుల్‌ ఇళ్లను ప్రాభించనున్న సీఎం కేసీఆర్

spot_img

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధునాతన సౌకర్యాలతో పేదల కోసం సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన 15వేల 60 ఇండ్ల సముదాయాన్ని ఈనెల 22న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోనున్నట్లు తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

కొల్లూరులో సీఎం డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఇవాళ(మంగళవారం) అధికారులతో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రారంభానికి అన్ని విధాలా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రూట్ మ్యాప్ పై చర్చించి పలు సూచనలు చేశారు. కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గా, ఆసియా మోడల్ గా నిలువనుందని తెలిపారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే ఈ నిర్మాణాలు సకల సౌకర్యాలతో పూర్తి అయ్యాయన్నారు. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు.

ఈనెల 22న ఉదయం 10 గంటలకు సీఎం కేసిఆర్ కొల్లూరు గృహ సముదాయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. పేదల కోసం 100 శాతం సబ్సిడీతో పూర్తి ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న ఇండ్లు ఇవి అన్నారు. గతంలో కాగితాల్లో ఇండ్లు చూపించే వారు.. లక్షల రూపాయలు బిల్లులు డ్రా చేసుకునే వారు.. కానీ నేడు కండ్లకు సాక్షాలుగా డబుల్ బెడ్రూం ఇండ్లు కనిపిస్తున్నాయని అన్నారు. మెల్లగా కట్టిన మంచిగ కట్టించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని 6గురు లబ్దిదారులకు ఇంటిపట్టా అందజేస్తారనీ తెలిపారు. నిర్మాణ సముదాయంలో సుమారు 50 నుంచి 60వేల మంది ఉండే ఆస్కారం ఉండటంతో 103 షాపింగ్ కాంప్లెక్స్ లు, కమ్యూనిటీ హాల్, పోలీస్ స్టేషన్,లిఫ్ట్ లు,మంచినీళ్లు,డ్రైనేజీ ,రోడ్లు లాంటి అన్ని రకాల మౌళిక సదుపాయాలు ఉంటాయని వివరించారు. భవిష్యత్ కొల్లూరులోని ఈ ప్రాంతం మున్సిపాలిటీ అయ్యే అవకాశం ఉందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

Latest News

More Articles