గజ్వేల్ నియోజకవర్గం లో కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించడం కోసం అందరూ కలిసికట్టుగా ఉండి కృషి చేయాలన్నిరు మంత్రి హరీష్ రావు. ఇవాళ(మంగళవారం) సిద్దిపేట లో రైతుబంధు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, కొండపాక వైస్ ఎంపీపీ దేవి రవీందర్, మర్కుక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి లు రూపొందించిన 2023 ఎన్నికల పాటల సీడీని ఆవిష్కరించారు మంత్రి. ఆ తర్వాత మాట్లాడిన ఆయన..ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు తెలపాలన్నారు. కేసీఆర్ మూడో సారి సీఎం అయితేనే అభివృద్ధి పథకాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలవుతాయన్నారు.
ఇది కూడా చదవండి: నా బిడ్డ చావుకు కారణమైన వాడికి ఉరిశిక్ష వేయండి.. ప్రవళిక తల్లి డిమాండ్