వరంగల్ : తన బిడ్డ చావుకు కారణమైన వాడికి ఉరిశిక్ష వేయాలని మర్రి ప్రవళిక తల్లి విజయ డిమాండ్ చేసింది. రెండు సంవత్సరాల నుంచి తన బిడ్డను, కొడుకుని హైదరాబాద్లో చదివించుకుంటున్నానని విజయ తెలిపారు. ఎండల కాయ కష్టం చేసి పిల్లలను చదివిస్తున్నామని తెలిపారు.
Also Read.. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలి
కానీ, వాడు మా పిల్లను వేధించాడు. వాడి టార్చర్ భరించలేక మా అమ్మాయి కనీసం మాతో కూడా చెప్పుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని శిక్షించాలి. వాడిని బయటకు రాకుండా చేయాలి. నా బిడ్డ కష్టం వేరే వాళ్లకు రాకూడదన్నారు. మీకు పార్టీల పరంగా ఏమైనా గొడవలు ఉంటే మీరు చూస్కోవాలని, అంతే కానీ తమ కుటుంబాన్ని అందులో లాగకండని ఆమె విజ్ఞప్తి చేశారు. నా బిడ్డను చావుకు కారణమైన వాడికి మాత్రం ఉరిశిక్ష వేయాలని ప్రవళిక తల్లి విజయ డిమాండ్ చేశారు.