Wednesday, May 1, 2024

అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలి

spot_img

అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ ను గెలిపించాలన్నారు మంత్రి గంగుల కమలాకర్ . ఇవాళ(మంగళవారం) కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి.. కేసీఆర్ పాలనలో లా అండ్ ఆర్డర్ భేషుగ్గా ఉందన్నారు. శాంతి భద్రతలు ఉన్న దగ్గర అభివృద్ధి జరుగుతుందని, కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ క్షేమంగా ఉంటుందన్నారు.

కరీంనగర్ జిల్లా ఉద్యమాల జిల్లా అని.. ఎన్నో అభివృద్ధి పనులకు వేదికగా మారిందని అన్నారు మంత్రి గంగుల.మీ ఆకాంక్ష మేరకు అభివృద్ధి చేశానన్నారు. ఇంకా చేయాల్సి ఉంది.. సమస్యలు చూసి పారిపోలేదన్నారు. అందమైన కేబుల్ బ్రిడ్జిని నిర్మించామన్నారు. ఏడాదిలో మానేర్ రివర్ ఫ్రంట్ పూర్తి అవుతుందని తెలిపారు. గత పాలకుల పరిపాలన చూడండి, బీఆర్ స్ పార్టీ పరిపాలన చూడండి అని చెప్పారు.

సీఎం కేసీఆర్… మంత్రి కేటీఆర్ ల ఆశీర్వాదంతో 4వ సారి బరిలో దిగుతున్న తనను ఆశీర్వదించండని కోరారు. హైదరాబాద్ తర్వాత గొప్పగా అభివృద్ధి చేస్తానని అన్నారు. రేపు(బుధవారం) 10 గంటలకు ప్రజా ఆశీర్వాద సభ కరీంనగర్ లో ఉందని, ఈ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటున్నారని నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆశీర్వదించండని పిలుపునిచ్చారు మంత్రి గంగుల.

ఇది కూడా చదవండి: రేవంత్ ఓవర్ యాక్షన్.. పోలీసుల యాక్షన్

Latest News

More Articles