ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇవాళ(మంగళవారం) బండిపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. బండిపొరా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయన్ని తెలిపారు బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్. ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందన్నారు.
ఇది కూడా చదవండి: అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలి