Monday, May 20, 2024

రాష్ట్ర సంపద సబ్బండ వర్గాలకు పంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

spot_img

మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలు ఆమోదించదగిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.  భారతదేశ చరిత్రలో  ఏ రకంగా చూసినా అనేక అంశాల్లో  తెలంగాణ ఉన్నత స్థానంలో ఉందన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ ఛైర్మెన్ బిందు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read.. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలి

బీజేపీ,కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు, అంతర్గత కుమ్ములాటలతో రాద్దాంతం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలన్నీ నేరవెర్చారు. తాజా మ్యానిఫెస్టో కూడా అమలుపరుస్తారు. ఆ నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. సీఎం కేసీఆర్ పిలుపునిస్తే రాష్ట్ర స్థాయి నుండి బూత్ లెవల్ వరకు ప్రతి కార్యకర్త ఆచరించి కష్టపడి పని చేసే ఒక క్రమశిక్షణ కల పార్టీ బిఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర సంపద సబ్బండ వర్గాలకు పంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి సత్యవతి తెలిపారు.

Latest News

More Articles