Wednesday, May 8, 2024

స్వ‌లింగ సంప‌ర్కుల‌ వివాహంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

spot_img

న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెలువ‌రించింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలో జ‌స్టిస్ సంజ‌య్ కిష‌ణ్ కౌల్‌, ఎస్ ర‌వీంద్ర భ‌ట్‌, హిమా కోహ్లీ, పీఎస్ న‌ర్సింహా ఉన్నారు. సీజే చంద్ర‌చూడ్ ఇవాళ కోర్టులో తీర్పును చ‌దివారు.

Also Read.. రాష్ట్ర సంపద సబ్బండ వర్గాలకు పంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

స్వ‌లింగ సంప‌ర్కుల వివాహాన్ని ప్రాథ‌మికంగా గుర్తించ‌లేమ‌ని సీజే చంద్ర‌చూడ్ తెలిపారు. సేమ్ సెక్స్ మ్యారేజ్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. స్వలింగ వివాహాల‌పై కోర్టు చ‌ట్టాన్ని రూపొందించ‌లేద‌న్నారు. కేవ‌లం పార్ల‌మెంట్ ద్వారానే స్పెష‌ల్ మ్యారేజ్ యాక్టులో మార్పులు చేయాల‌ని సీజే సూచించారు. శాస‌న వ్య‌వ‌హారాల్లోకి కోర్టు జోక్యం చేసుకోదు అని స్పష్టం చేశారు.

Also Read.. ములుగుకు రాహుల్ గాంధీ ఏ అర్హతతో వస్తారు

లైంగిక ప్ర‌వృత్తి ఆధారంగా వివ‌క్ష ప్ర‌ద‌ర్శించ‌డం స‌రికాదని ఈ సందర్భంగా అని సీజే అన్నారు. స్త్రీ-పురుష జంట‌ల‌కు క‌ల్పించే సేవ‌ల్ని, స్వలింగ సంప‌ర్కుల‌కు ఇవ్వ‌క‌పోవ‌డం ప్రాథ‌మిక హ‌క్కుల ఉల్లంఘ‌నే అవుతుంద‌న్నారు. అదే విధంగా ద‌త్త‌త హ‌క్కుల‌కు ఎల్జీబీటీ జంట‌ల‌కు క‌ల్పించ‌క‌పోవ‌డం ఆర్టిక‌ల్ 15ను ఉల్లంఘించిన‌ట్లు అవుతుంద‌ని సీజే స్పష్టం చేశారు. స్వలింగ జంట‌ల ప‌ట్ల వివ‌క్ష చూప‌డం క‌రెక్టు కాదన్న సీజే.. ఆయా వ్య‌క్తుల ప‌ట్ల వివ‌క్ష చూప‌కుండా ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త‌న తీర్పులో సూచించారు.

Latest News

More Articles