Saturday, May 18, 2024

పాట రూపంలో సాయిచంద్ అందరి గుండెల్లో చిరకాలం ఉంటాడు

spot_img

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు, ఉద్యమ కారుడు సాయిచంద్ మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ్ముడు సాయిచంద్ అకాల మరణం తనను ఎంతో బాధకు గురి చేసిందన్నారు. తన ఆట, పాటతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదన్నారు. భౌతికంగా మన మధ్య లేకున్నా, పాట రూపంలో అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని అన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

Latest News

More Articles