తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు సార్ కల అని, ఆ కలను సీఎం కేసీఆర్ నిజం చేసి చూపించారని ప్రశంసించారు. నిర్మల్ పట్టణంలో ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… జయశంకర్ సార్ తెలంగాణే ఊపిరిగా శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసం ఉద్యమించారని ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కేసీఆర్కు వెన్నంటి ఉండి రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారని కొనియాడారు.
తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ .
ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా నిర్మల్ లో ఆయన విగ్రహానికి నివాళులర్పించాను. pic.twitter.com/ZgRU9k7fUM— Indrakaran Reddy (@IKReddyAllola) June 21, 2023