Saturday, May 11, 2024

బీజేపీకి మ‌తమే ప్ర‌ధాన ఎజెండా

spot_img

బీఆర్‌ఎస్‌ పాలనలో గడప గడపకు సంక్షేమం అందిందని, కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని నిర్మ‌ల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి, మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని చింతకుంట వాడ, పాత బస్టాండ్ , పింజరి గుట్టలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్ర‌జ‌ల కోసం సీయం కేసీఆర్ అమ‌లు చేస్తున్న సంక్షేమ‌ పథకాలను వివరిస్తూ, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను తెలియజేస్తూ ప్రచారం కొనసాగించారు

కాలనీల అభివృద్ధి బాధ్యత నాదని, మీరు భరోసాగా ఉండాలన్నారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. మూడ‌వ‌ సారి ఆశీర్వ‌దించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే… నిర్మ‌ల్ మ‌రింత అభివృద్ధి చేస్తాన‌ని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు మోస‌పూరిత మాట‌లు నమ్మ వ‌ద్ద‌ని కోరారు. అయితే బీజేపీకి మ‌తమే ప్ర‌ధాన ఎజెండా అని, ప్ర‌జ‌లు దీన్ని గుర్తించి, నిర్మ‌ల్ కు ఎవ‌రి వ‌ల్ల మంచి జ‌రుగుతుందో ఆలోచించి ఓటేయాల‌ని సూచించారు.

ఇది కూడా చదవండి: BRS అభ్యర్థులు గెలిస్తేనే పథకాలు కొనసాగుతాయి

Latest News

More Articles